బీజేపీకి ఆశ పెరిగిపోతోంది. ఆలోచనలు కూడా దూకుడుగా ఉంటున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడాలన్న కోరిక కూడా ఎక్కువగా ఉంది. దాంతో సున్నా నుంచి వందకు చేరువ కావాలన్న కోరికతో కాషాయం పార్టీ రగులుతోంది. దానికి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటోంది. 

 

మొత్తానికి చూస్తే బీజేపీ నోటి  వెంట ఆ మాట వచ్చేసింది. అది కూడా ఎవరు చెప్పాలో వారే చెప్పేశారు. ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ డియోధర్ ఉన్న విషయం కుండబద్దలు కొట్టారు. మాకు అన్ని రంగులూ ఒకటే, వాటిని కాషాయం చేయడమే లక్ష్యమని కూడా అనేశారు. ఇదంతా ఎందుకంటే విజయసాయిరెడ్డి టీడీపీ మిడతల దండు బీజేపీ వైపుగా దూసుకువస్తోందని, కమలం పువ్వుని కొరికేయడానికి వస్తోందని సెటైరికల్ గా ఒక కామెంట్ చేశారు.

 

పసుపు మిడతలు కమలం పువ్వుని కొరికి వదిలిపెడతాయని ఆయన అన్న దానికి అర్ధం. అంటే బీజేపీలోనే ఉంటూ టీడీపీకి  మేలు చేసే మాజీ తమ్ముళ్ళు, అలాగే కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఇపుడు ఏపీ బీజేపీని చెడుపు చేస్తున్నారని విజయసాయిరెడ్ది చెప్పుకొచ్చారు.

 

దానికి రిటార్ట్ అనంట్లుగా  వెంటనే సునీల్ డియోడర్ లైన్లోకి వచ్చేశారు. ఒక్క పసుపు రంగు ఏంటి అన్ని రంగులను ఆకర్షిస్తాం అంటూ బాహాటంగా తమ ఆకర్ష్ మంత్రాన్ని చదివారు, ఇది నిజంగా సంచలనమే, ఎటువంతి తడబాటు, పొరపాటు లేకుండా బీజేపీ పెద్ద మనిషి ఇలా మాట్లాడడం ద్వారా తమ తరువాత  టార్గెట్ వైసీపీ మీదనే అని చెప్పేశారు.

 

దీంతో ఏపీ రాజకీయాల్లో ఇపుడు చర్చ అవుతోంది. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణం రాజు కొరకరాని కొయ్యగా మారారు. ఆయన పై వేటు వేయాలని బీజేపీని వైసీపీ కోరింది. కానీ అది స్పీకర్ పరిధిలో ఉంది. ఆయన మీద వేటు వేస్తే ఎవరూ బీజేపీ వైపు రారు. అందువల్ల ఆయన మీద వేటు కష్టమే. ఆ విధంగా మిగిలిన వైసీపీ ఎంపీలను కూడా చేరదీయాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ తమ టార్గెట్ అని చెప్పేశారు. ఇక జాగ్రత్త పడాల్సింది జగనే.

మరింత సమాచారం తెలుసుకోండి: