మానవ జీవితం ఉదయంపూట టిఫిన్తో మొదలై , మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ , రాత్రి మళ్లీ భోజనంతో రోజు ముగుస్తుంది. అయితే ఎక్కువ మంది అనుసరించే భోజన విధానం ఇదే. కానీ కొందరు తమకు నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు, ఏదిపడితే అది ఆహారంగా తింటారు. అయితే అది మన శరీరానికి అంత మంచిది కాదు.
అయితే చాల మందికి రాత్రి భోజనం ఆలస్యంగా తినడం అలవాటు ఉంటుంది. అయితే ఆలా తినడం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అర్ధరాత్రిళ్లు లేదా లేటుగా డిన్నర్ చేసి తినేవారి రక్తంలో చక్కెర శాతం విపరీతంగా పెరిగిపోతుందని ఓ సర్వేలో తేలిందని నిపుణులు తెలియజేశారు.
అయితే చాలామందికి ఫ్రిజ్లో ఆహారం ఉన్నా లేకున్నా.. దాన్ని తెరిచి చూడటం అలవాటు. ఒక వేళ అందులో ఏమైనా ఉంటే తినకుండా వదిలిపెట్టరు. ముఖ్యంగా నగర జీవితానికి అలవాటుపడే యువతకు ఎక్కువగా ఇదే అలవాటు. టీవీలు, సెల్ఫోన్లు చూస్తూ.. ఆలస్యంగా నిద్రపోతారు. ఫలితంగా రాత్రి వేళ చిరుతిళ్లు తింటూ టైంపాస్ చేస్తారు. తమకు నచ్చిన జంక్ఫుడ్ను లాంగించేస్తారు. అయితే, ఈ ఆహారం మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనల్లో తేలింది.
అయితే కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల పాటు లేట్నైట్ జంక్ఫుడ్ తినే వారిని ప్రత్యేకంగా పరిశీలించారు. వారి వివరాలను సేకరించి వారి ఆరోగ్య పరిస్థితులపై నిఘా పెట్టారు. నిద్రకు ముందు జంక్ఫుడ్, స్నాక్స్ తినేవారిలో మెదడు తీవ్ర ప్రభావానికి గురైనట్లు తెలుసుకున్నారు.
ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి అతి త్వరగా సన్నగిల్లుతుందని తెలుసుకున్నారు. రాత్రివేళ్ల జంక్ ఫుడ్ తింటే నిద్రలేమి సమస్యలు వేధిస్తాయని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి. చూశారుగా మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి అని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.