ఈ మద్య డబ్బు కోసం అడ్డమైన దారులు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవారి శీలాన్ని ఎరగా వేసి లక్షలు.. కోట్లు దండుకుంటున్న దళారులు ఎంతో మంది మన సమాజంలోనే తిరుగుతున్నారు.  కొంత మంది ఆడవారి బలహీనతలు క్యాష్ చేసుకుంటూ హైటెక్ వ్యభిచారం నడిస్తూ.. డబ్బు సంపాదిస్తున్నారు.  ఈ డబ్బు కోసం మనిషి విలువలు కోల్పోతున్నారు.. మానవ సంబంధాలు పక్కనబెడుతున్నారు.  తాజాగా ఓ యువతిపై ఆమె మారు తండ్రి కన్నేశాడు.. ఆమెను అనుభవించాలని కోరిక తల్లితో చెప్పాడు. అంతే అతనికి పూర్తి సహకారం అందించింది ఆ తల్లి. ఈ దారుణ ఘటన బెంగళూరులోని ఉద్యాన నగరిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి(20) తల్లి రీమా కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం అలెగ్జాండర్ దాస్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది.

 

అతడు ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తుండగా, రీమా కుమార్తె (20) ఓ కాలేజీలో చదువుకుంటోంది. అరెకెరెలోని ఓ అద్దె ఇంట్లో వీరు నివసిస్తున్నారు. వరుసకు కన్న కూతురు అయినా ఆమెపై మోజు పెంచుకున్నాడు ఆ దుర్మార్గపు తండ్రి. కుమార్తె వరుసైన యువతిపై తన భర్త కన్నేసిన విషయం తెలుసుకున్న రీమా అతడికి సహకరించింది. టీ, ఇతర ఆహార పదార్థాల్లో నిద్రమాత్రలు కలిపి కుమార్తెకు ఇచ్చేది. అవి తీసుకుని నిద్రమత్తులోకి జారిపోయిన అనంతరం దాస్ ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు.  

 

ఇలా ఏడాది కాలంగా ఈ దారుణం కొనసాగుతుంది.  తనపై లైంగిక దాడి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న యువతి దాస్ ని నిలదీయడంతో సెల్ ఫోన్ లాక్కొని కాలేజ్ కి వెళ్లవొద్దని హుకుం జారీ చేశాడు.. అంతే కాదు ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయిన బాధితురాలు తాజాగా హుళిమావు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతడి దారుణాలకు తన తల్లి కూడా సహకరించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: