రష్యా, చైనా, భారత్​ల కంటే అమెరికాలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అందువల్లనే మిగతా దేశాల కంటే యూఎస్​లో ఎక్కువ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం వల్లనే కరోనా మరణాల రేటు మిగతా దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు.అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో రష్యా, చైనా, భారత్, బ్రెజిల్ లాంటి పెద్ద దేశాల కంటే అమెరికానే చాలా మెరుగ్గా ఉందన్నారు. అందువల్లనే మిగతా దేశాల కంటే యూఎస్​లో కరోనా మరణాలు రేటు చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

 

అమెరికాలో ఇప్పటి వరకు 34,79,483 మందికి కరోనా సోకగా.. 1,38,247 మంది మరణించారు. అంటే మిగతా ప్రపంచదేశాలతో పోల్చుకుంటే అమెరికాలోనే ఎక్కువ కొవిడ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. అయితే అమెరికాలో నిర్వహించిన స్థాయిలో మిగతా దేశాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తే... ఆశ్చర్యకరమైన రీతితో పాజిటివ్ కేసులు బయటపడతాయని ట్రంప్ చెబుతున్నారు.ప్రపంచానికి చైనాప్లేగు(కరోనా)ను బీజింగ్​ అంటగట్టింది. దాన్ని చైనా వైరస్ అని అంటారా.. మరేమైనా అంటారా అనేది మీ ఇష్టం. ఈ వైరస్​కు దాదాపు 20 మారు పేర్లు ఉన్నాయి. చైనా చేసిన ద్రోహాన్ని ప్రపంచం మరిచిపోకూడదు' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

 

ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్​- చైనా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం మాత్రం చెక్కుచెదరకుండా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది కొనసాగిస్తారా లేదా అన్నది ఇక చైనా ఇష్టమని ఆయన తేల్చిచెప్పారు.యూఎస్​లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్న విమర్శలపై... ట్రంప్ భిన్నంగా స్పందించారు.ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలో భారీ ఎత్తున కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందువల్లనే మిగతా దేశాల కంటే అధికంగా యూఎస్​లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. అని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: