ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసారు. మొదటి విడత... రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు ఒక్కసారి చూస్తే... 1.శ్రీకాకుళం జిల్లా ...  రెవెన్యూ డివిజన్ ...శ్రీకాకుళం మండలాలు...ఎచ్చెర్ల, జి.సిగడం, రణస్ధలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి లో ఎన్నికలు జరుగుతాయి. రెవెన్యూ డివిజన్...టెక్కలి లో, మండాలాలు ....జలుమూరు, రెవెన్యూ డివిజన్ ...పాలకొండ, మండలాలు ...సరవకోట లో ఎన్నికల నిర్వహణ ఉంటుంది.

2. విశాఖపట్నం జిల్లా... రెవెన్య డివిజన్...విశాఖపట్నంలో మండలాలు... భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ 3. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం డివిజన్ లో మండలాలు... అయినవిల్లి, ఆళ్లవారం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనకోన, కొత్తపేట, మలికిపురం, మామిడికుదరు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖనేటిపల్లి, ఉప్పలగుప్తం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 4. పశ్చిమ గోదావరి... ఏలూరు  డివిజన్ లో, 5. కృష్ణా జిల్లాలో నూజివీడు డివిజన్ కు ఎన్నికలు నిర్వహిస్తారు.

6. గుంటూరు జిల్లాలో గుంటూరు డివిజన్‌కు 7. నెల్లూరు జిల్లాలో  నెల్లూరు డివిజన్ కు ఎన్నికలు ఉంటాయి. 8. కర్నూలు జిల్లాలో ఆదోని రెవెన్యూ డివిజన్‌కు, 9. అనంతపురం జిల్లాలో పెనుకొండ రెవెన్యూ డివిజన్ కు ఎన్నికలు నిర్వహిస్తారు. 10. కడప జిల్లాలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కు, కడప డివిజన్‌లో చక్రాయపేట, యర్రగుంట్లలో ఎన్నికలు ఉంటాయి. 11. చిత్తూరు జిల్లాలో తిరుపతి రెవెన్యూ డివిజన్ లో మొదటి విడత ఎన్నికలు ఉంటాయి. 68 డివిజన్లలో నాలుగు‌ విడతలుగా  659 మండలాల్లో ఎపి లో  పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పోలింగ్ సమయం.ఉదయం6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ఉంటుందని ఎన్నికల కమీషనర్ పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత లెక్కింపు, ఫలితాలు‌ విడుదల ఉంటుందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: