మెదక్ జిల్లా తునికి లోని కృషి విజ్ఞాన కేంద్రం లో నూతన పరిపాలన భవనాన్ని ప్రారంభించిన ప్రారంబించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సేంద్రియ పంటల విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమం లో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహకు అధ్యక్షుడు సురేష్ భయ్యాజి జోషి.. ఐ సి ఎ ఆర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నర్సాపూర్ ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం ఉండడం వల్ల ఇక్కడ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది అని అన్నారు.

గతంలో మన దేశంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం చేయబడింది అని ఆయన పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తున్న ఇట్లాంటి కేవికే లు మనకు ఎంతో అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. మన దగ్గర పండ్ల దుకాణాలలో విదేశాల్లో పండే పండ్లు అమ్ముతున్నారు అని ఆయన అన్నారు. మన దేశమే వ్యవసాయ ఆధారిత దేశం మనం ఇక్కడ మనకు కావలిసిన పండ్లు పండించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారాలి అని ఆయన ఆకాంక్షించారు.

ఆ దిశగా శాస్త్రవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు. రైతులు అందిపుచ్చుకోవాలి అని సూచించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. వ్యవసాయానికి సరిపడ విద్యుత్ నిలువలు పెంచింది అని అన్నారు. పరిశ్రమలకు కుడా నిరంతరంగా కరెంట్ ఇస్తున్నాం అని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నాం అని ఆయన అన్నారు. మద్దతు ధర ఇస్తు వ్యవసాయం ద్వారా రెట్టింపు లాభాలు వచ్చేలా మోడి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎక్కడ ధర ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకొనే అవకాశం కల్పిస్తుంది మోడి ప్రభుత్వం  అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: