ఎన్నో కేసులలో నిందితుడిగా ఉండి 16 నెలల జైలు శిక్ష అనుభవించి లెక్కకు మించిన ఆస్తులు గడించి. . ఇప్పటికీ ఆ కేసులు కోసం కోర్టు ల చుట్టూ తిరుగుతున్న సీఎం జగన్ న్యాయమూర్తులను తప్పు పట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే ఇది న్యాయమూర్తులు తెలంగాణ రాష్ట్రం లో సంచలనం సృష్టించిన దిశా ఘటన నిందితుల ను రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ చేయడాన్ని తప్పు పట్టింది. ఈ ఎన్ కౌంటర్ ని దేశం మొత్తం గౌరవించింది అని గుర్తు చేశారు. ఈ న్యాయమూర్తులు మాత్రం అప్పుడు న్యాయస్థానాన్ని , రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
కొన్ని సందర్భాల్లో న్యాయ స్థానాలు చేసేవి ఒప్పని. . మరికొన్ని సందర్భాల్లో తప్పని.. చెప్తున్న ఈ న్యాయమూర్తులు మా ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత కోల్పోయారని వైఎస్ఆర్ సీపీ నాయకులు అన్నారు. నిజంగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వారు అలా మాట్లాడరు అని అన్నారు. వీరి కే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు వీరు న్యాయమూర్తి గా ఉంటూ న్యాయ వృత్తిలో కొనసాగడానికి అసలు అర్హులో కాదో తేల్చు కోవాలని వారిపై విమర్శలు చేస్తున్నారు.