తేజస్విని హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దివ్య తేజస్వినిని కత్తి తో పొడిచి చంపేసిన ఉన్మాది నాగేంద్ర ఆత్మ హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. అతను ప్రస్తుతం గుంటూరు లోని ప్రముఖ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు నాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాల నుంచి తనకు దివ్యతో పరిచయం ఉందని నిందితుడు విచారణలో తెలిపాడు. గత ఏడాది క్రితం అమ్మాయి ఒత్తిడి చేయడంతోనే పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయం పై వారి పెద్దలను అడిగితే వారు దారుణంగా తిట్టారు. దీంతో దివ్య చనిపోదామని చెప్పింది.
దివ్య చనిపోవడం పై మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై నాగేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. ఆడవాళ్ళకు అన్యాయం జరిగితే నిరసన లు చేయకూడదు. మగవాళ్లకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మహిళా సంఘాలు న్యాయం కోసం పోరాడాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.మరోవైపు మృతురాలు దివ్య తేజస్విని నాగేంద్రతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్గా మారాయి. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.. వారిద్దరూ కలిసి తిరిగిన ప్లేసులు, వాట్సాప్ లో మెసేజ్ లు బయటపడ్డాయి. ఇది అంతా నిజం కాదని దివ్య తల్లి కుసుమ ఖండిస్తుంది.. ఈ విషయం పై పూర్తి వివరాలను పోలీసులు తెలపాలి..