ముఖ్యంగా ఈ మధ్యకాలం లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు సంచలనం గా మారిపోతున్నాయి. ఓ ఘటన గురించి మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వస్తు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. తరచూ వరుసగా వెలుగులోకి వస్తున్న అత్యాచార ఘటనలు ఆడపిల్లలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కామాంధులు కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఆడపిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇటీవలే హత్రాస్ లో దళిత యువతిపై కొంతమంది కామాంధులు దారుణంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి ఆ తర్వాత హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ దారుణ ఘటన గురించి మరవకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. బారాబంకి ప్రాంతంలో 18 సంవత్సరాల దళిత యువతిపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులు అనంతరం ఏకంగా ఆ యువతి గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. పొలానికి వెళ్లిన కుమార్తె ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు... పొలానికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడం చూసి ఒక్కసారిగా బోరున విలపించారు. పోస్టుమార్టం నిర్వహించగా యువతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది.