వైసీపీ ఇది మా గొప్పతనం అని చెప్పుకుంటుంది..అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో వర్షం పడితే 1 టౌన్ లో పడవలు వేసుకుని వెళ్లేవారని అన్నారు. ఇవ్వాళ అలాంటిది లేకుండా డ్రైనేజీ వ్యవస్థ బాగుపడి ఉందంటే దానికి కారణం నాని అని కీర్తించారు. విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాట్లాడుతూ... ప్రజలు కోరుకున్న ఇంద్ర కీలాద్రి ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిందన్నారు. నాని తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం సాకారం అయిందనన్నారు.
ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి 130 కోట్ల రూపాయలు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని ఆయన వివరించారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబందించిన పూర్తి క్రెడిట్ టీడీపీ ప్రభుత్వానిదే అని వివరించారు. బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఈ రోజు శంఖుస్థాపన చేశారని ఆయన అన్నారు. అభివృద్ధి అనే మాటకు ఈప్రభుత్వం స్థానం లేకుండా చేసిందని చెప్పారు. రోడ్లన్నీ పాడయిపోయాయి..వర్షానికి మరింత పాడయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. తీరం దాటేటప్పుడు కానీ ఈ ప్రభుత్వం సహాయక చర్యలు పాటించలేదని విమర్శించారు. 43 వేల కోట్ల రూపాయల కేసుల్లో ఉన్న వ్యక్తి ఫ్రస్ట్రేషన్ లో న్యాయ వ్యవస్థ మీదే దాడి చేస్తున్నారని ఆరోపించారు.