ఈ ఫ్లాఫ్ సేల్ లో కేవలం రూ.1కే రెడ్ మీ నోట్ 9ప్రో, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్ ని అమ్ముతోంది. కానీ ఈ స్మార్ట్స్ బ్రాండ్స్ లిమిట్ యూనిట్స్ మాత్రమే ఉంటాయని సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన రెడ్ మీ నోట్ 9 ప్రో ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ 4 జీబీ+64 బీజీ వేరియంట్ ను రూ.1కే ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మనున్నారు. కేవలం 10 యూనిట్లు మాత్రమే ఫ్లాష్ సేల్ చేయనున్నారు.
ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రూ.500 విలువైన ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 ప్రొడక్ట్స్ ను రూ.1కే అందించనున్నారు. ఇవీ కేవలం 50 యూనిట్ల వరకు మాత్రమే ఉండనున్నాయి. అక్టోబర్ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు రూ.1,899 విలువైన ఎంఐ స్మార్ట్ బ్రాండ్ 4 ప్రొడక్ట్ ను రూ.1కే ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. ఇవీ కేవలం 25 యూనిట్ల వరకు మాత్రమే ఉంటాయని షావోమీ ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ లో చాలా ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులు, డిస్కౌంట్లు అందిస్తున్నామని, వినియోగదారులు తప్పక ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ పేర్కొంది.