దసరా, దివాళీ సేల్స్ ప్రారంభమయ్యాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ ఎంఐ సేల్ ప్రకటించింది. టాప్ దివాళీ డీల్స్, దివాళీ బెస్ట్ సెల్లర్స్ పేరుతో అనేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. ఈ సేల్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫ్లాష్ సేల్. కేవలం ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. అయితే ఈ ఫ్లాష్ సేల్స్ అక్టోబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని షావోమీ ప్రకటించింది. ప్రతి సేల్ లో ప్రతిరోజు ఫ్లాజ్ సేల్ నిర్వహిస్తోంది. రోజూ రెండు ప్రొడక్ట్స్ చొప్పున ఆరు రోజుల్లో 12 ప్రొడక్ట్స్ ని ఫ్లాష్ సేల్ లో అమ్మనుంది.

ఈ ఫ్లాఫ్ సేల్ లో కేవలం రూ.1కే రెడ్ మీ నోట్ 9ప్రో, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్ ని అమ్ముతోంది. కానీ ఈ స్మార్ట్స్ బ్రాండ్స్ లిమిట్ యూనిట్స్ మాత్రమే ఉంటాయని సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన రెడ్ మీ నోట్ 9 ప్రో ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ 4 జీబీ+64 బీజీ వేరియంట్ ను రూ.1కే ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మనున్నారు. కేవలం 10 యూనిట్లు మాత్రమే ఫ్లాష్ సేల్ చేయనున్నారు.

స్మార్ట్ ఫోన్ తో పాటు రూ.500 విలువైన ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 ప్రొడక్ట్స్ ను రూ.1కే అందించనున్నారు. ఇవీ కేవలం 50 యూనిట్ల వరకు మాత్రమే ఉండనున్నాయి. అక్టోబర్ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు రూ.1,899 విలువైన ఎంఐ స్మార్ట్ బ్రాండ్ 4 ప్రొడక్ట్ ను రూ.1కే ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. ఇవీ కేవలం 25 యూనిట్ల వరకు మాత్రమే ఉంటాయని షావోమీ ప్రకటించింది. ఈ ఫ్లాష్ సేల్ లో చాలా ప్రొడక్ట్స్ పై భారీ తగ్గింపులు, డిస్కౌంట్లు అందిస్తున్నామని, వినియోగదారులు తప్పక ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: