ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటిలో ఎలాంటి పొరపాట్లు, జాప్యం లేకుండా చూసుకుంటున్నారు.. అదే సమయంలో గతంలో అవినీతి కి పాల్పడ్డ నాయకుల చేమడాలు తీస్తున్నారు.. ఇప్పటికే చంద్రబాబు హయాంలో అవినీతి కి పాల్పడ్డ నేతలను జగన్ ఊచలు లెక్కపెట్టిస్తున్నాడు.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జెసి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలను అవినీతి కేసులో జైలుకి పంపగా మరికొంతమంది లిస్ట్ ను జగన్ తయారు చేశారు.. అమరావతి భూ కుంభ కోణాల్లో జరిగిన అవినీతి ని వెలికితీసే పనిలో జగన్ ఉన్నారు.. అయితే అవినీతి పరులను వెలికి తీయడం టీడీపీ కి కక్ష్య సాధింపు చర్యల కనిపిస్తుండడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది..
మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు విషయంలో అయినా, కొల్లు రవీంద్ర విషయంలో అయినా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటే విషయం కొంత ఉంది అన్నది అర్ధమవుతోంది కదా. ఇక ఇదే తీరున ఏపీలో ఏ పెద్ద టీడీపీ లీడర్ విషయంలో దర్యాప్తు చేసినా కక్ష అంటున్నారు. ఏకంగా అమరావతి రాజధాని భూ దందా విషయంలో కూడా ఇదే మాట. అక్కడ దందా జరగలేదని ఆ గట్టునే ఉన్న బక్క రైతును చెప్పమన్నా మొత్తానికి మొత్తం చెబుతాడు. మరి ఇవన్నీ విచారణ చేయకూడదు అంటున్నారు. ఇలా అయితే అవినీతి రహిత రాష్ట్రాన్ని ఎలా తాయారు చేయాలో అర్థం కావట్లేదు అని జగన్ సన్నిహితులు అంటున్నారు..