ఇలాంటి నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయిల్ భారత్ గురించి చేసిన ఒక ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఇజ్రాయిల్ విదేశాంగ రాయబారి రోజ్ మాలిక్... ఇటీవలికాలంలో అంతర్జాతీయంగా భారత్ ప్రభావం ఎంతో స్పష్టంగా కనిపిస్తుందని... ఇందుకు గాను భారత మిత్ర దేశమైన ఇజ్రాయిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ స్టేట్మెంట్ వెనుక ఎంతో అంతరార్థం ఉంది అని భారత విశ్లేషకులు అంటున్నారు.
అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయిల్ కి మధ్య ఎన్నో ఏళ్ల నుంచి శత్రుత్వం కొనసాగుతూ వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి క్రమంలోనే అరబ్ కంట్రీస్ కి ఇజ్రాయెల్ కి మధ్య శత్రుత్వం రూపుమాపి స్నేహ బంధాన్ని పెంచడంలో భారత్ ఎంతో కీలక పాత్ర పోషించింది. సౌదీ అరేబియా భారత్ పై అపారమైన ప్రేమ చూపెడుతూ ఏకంగా సోదర దేశం గా భావిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా తో చర్చలు జరిపి ఇజ్రాయెల్ తో ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టి స్నేహ బంధాన్ని పెంచడంలో భారత్ ఎంతో కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.