ఏ క్షణంలోనైనా చైనా భారత్ పై యుద్ధం చేసే అవకాశం ఉంది అని భావిస్తున్న భారత ప్రభుత్వం... డీఆర్డివో తయారు చేస్తున్నటువంటి క్షిపణులు మిస్సైల్ ని పరీక్షిస్తుంది... ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన మిసైల్ ను పరిశీలించి ప్రస్తుతం భారత అమ్ములపొదిలో చేర్చిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే భారత్ ఆర్మీ రోజురోజుకు పటిష్టంగా మారిపోయి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాని దీటుగా ఎదుర్కొని యుద్ధం చేసేందుకు క్రమక్రమంగా సిద్ధమైపోతుంది. ఇటీవలే మరో అద్భుతమైన ఆయుధాన్ని కూడా డి ఆర్ డి ఓ పరీక్షించి విజయవంతమైంది.
న్యూక్లియర్ వార్ హెడ్ ను కూడా మూసుకుపోయే సామర్థ్యం కలిగిన అత్యంత శక్తివంతమైన ఆధునికమైన క్షిపణి పృథ్వి 2 డి ఆర్ డి ఓ తయారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పగలు ఈ క్షిపణి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని గుర్తించిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు రాత్రి సమయంలో ఈ క్షిపణి పనిచేస్తుందా లేదా అనే విషయాలను ఇటీవలే పరీక్షించి విజయవంతమయ్యారు. పృథ్వి 2 రాత్రి సమయంలో కూడా ఎంతో సమర్థవంతంగా టార్గెట్లను ఛేదించి ధ్వంసం చేయగలదు అనే విషయాలను పరిశోధకులు గుర్తించారు. ఇక పృథ్వీ-2 పూర్తిస్థాయిలో సక్సెస్ అయింది కాబట్టి భారత అమ్ములపొదిలో కి వచ్చే అవకాశం ఉంది.