దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఎంతో మంది ప్రజలు కనీసం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక అల్లాడిపోతు ఉంటారు అనే విషయం తెలిసిందే. ప్రభుత్వాలు తమకు చేయూతనందించి కాస్తయినా సహాయం చేయకపోతాయా అని ప్రభుత్వాల వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అటు ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పేద ప్రజలందరికీ సహాయం చేసేందుకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దారిద్య రేఖకు దిగువన ఉన్న ప్రజలందరికీ మేలు చేకూరే విధంగా జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే నిరుపేదల అందరికీ శుభ వార్త చెప్పింది జార్ఖండ్ ప్రభుత్వం. కేవలం 10 రూపాయలకే ధోతి లేదా లుంగీ అంతే కాకుండా పది రూపాయలకే చీరను కూడా అందించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం వర్తిస్తుంది అంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. ఏడాదికి రెండు సార్లు ఈ అవకాశం లభిస్తుంది అంటూ తెలిపిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్... ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా ఈ పథకం అమలుతో గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారూ హేమంత్ .