ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే . క్షణికావేశంలో ఏకంగా సొంత  వారి ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు విషయంలో కూడా ఎలాంటి జాలీ దయా అనేది లేకుండా దారుణం గా వ్యవహరిస్తున్నారు తల్లిదండ్రులు. పరువు తీసింది అనే కారణంతో ఏకంగా కన్నబిడ్డలను దారుణంగా హత్య చేసిన ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది.




 చిన్నచిన్న కారణాలకే పరువు పోతుంది అని భావిస్తున్న తల్లిదండ్రులు ఏకంగా అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా దారుణంగా కడతేర్చేందుకు వెనకడుగు వేయడం లేదు. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించడమే ఆ యువతికి  పాపం గా మారిపోయింది. వేరే  కులం వాడిని ప్రేమించింది  అన్న  కారణంతో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. అల్లారు  ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ అని కూడా చూడకుండా... దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెట్టహళ్లి  కి చెందిన హేమలత అనే 18 సంవత్సరాల యువతి ఇటీవలే దారుణ హత్యకు గురైంది.



 దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టగా పోలీస్ విచారణలో ఎన్నో సంచలన నిజాలు బయటపడ్డాయి. చివరికి హేమలత హత్య పరువు హత్యగా తేల్చారు పోలీసులు. ప్రస్తుతం బీ కాం చదువుతున్న 18 సంవత్సరాల హేమలత మూడేళ్ల నుంచి ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఓ రోజు  తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసిపోయింది . ఈ క్రమంలోనే అన్యమతస్తున్ని  ప్రేమిస్తుంది అనే కారణంతో హేమలత తండ్రి కోపంతో ఊగిపోయాడు. కూతురు అన్యమతస్తున్ని  ప్రేమించడం ద్వారా పరువు పోయింది అని భావించాడు హేమలత తండ్రి. ఈ క్రమంలోనే ఈ నెల 14వ తేదీన తన సోదరుడు మరో వ్యక్తితో కలిసి బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం హేమలతను  ప్రియుడు అంతమొందించాలని వదంతులు సృష్టించగా..  పోలీసు విచారణలో అసలు నిజాలు బయట పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: