నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు.. ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీజేపీ అండతో ఇదంతా చేస్తున్నారని తెలిసినా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అయితే జగన్ కూడా ఈ విషయంలో బీజేపీ తో చేతులు కలిపారు.. అందుకోసం ఇటీవలే ఢిల్లీ కూడ వెళ్లారు..అయితే జగన్ ఢిల్లీ మంతనాలు ఫలించాయి.. ఇటీవలే పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించారు. ఆయన స్థానంలో వైసీపీకి చెందిన ఎంపీ బాలసౌరిని నియమించింది . పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని మోసం చేసారంటూ బ్యాంక్ వర్గాలు చేసిన పిర్యాదు మేరకు సీబీఐ లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం .
ఈ విషయంపై రఘు రామ కృష్ణం రాజు స్పందించారు.. చింత చచ్చిన పులుపు చావలేదన్నట్లు పదవి పోయినా రాజుగారి విమర్శల ఘాటు ఇంకా తగ్గలేదని చెప్పాలి.. నిన్న రాత్రి రఘురామ రాజు మీడియాకి విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ ఆ పదవి తన స్వయంకృషితో తెచ్చుకున్నా వైసీపీ ఎంపీగా పార్టీ ద్వారా తనకి వచ్చిందని , తనని పదవి నుండి తప్పించలేదని ఏడాది గడువు ముగియడంతో తానే దయ తలచి ఇచ్చానన్నట్టు చెప్పుకొన్నారు . ఒహవేల తనని పార్టీ నుండి డిస్మిస్ చేస్తే పులివెందులలో పోటీ చేసి రెండు లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చుకొంటానని సవాల్ విసిరిన రఘురామ రాజు దాన్ని అమరావతి పై రిఫరెండం గా తీసుకోవాలని కోరారు .