దాని పురోగతి గురించి ఎందుకు అడగలేకపోయారు అని ఆయన ప్రశ్నించారు. కూర్మాన పాలెం మీదుగా అచ్చుతా పురం వరకూ నాలుగు లైన్ల రోడ్డు డిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. సబ్బవరం నుంచి షీలా నగర్ వరకూ రోడ్డుకు టెండర్ అయింది అని ఆయన గుర్తు చేసారు. రీ టెండర్ పిలవాలన్న ఆలోచనే లేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆనందపురం భోగాపురం వరకూ రోడ్డు పూర్తవుతోన్న విషయం జగన్ కు తెలుసా అని ఆయన నిలదీశారు. తెలిస్తే ఎందుకు మళ్లీ కావాలని అడిగారు అని ఆయన నిలదీశారు.
చంద్రబాబు హయాంలో ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులను అడగడానికి జగన్ ఎందుకు వెనకాడారు అని ఆయన ప్రశ్నించారు. సింహాచల దేవస్ధానం భూ సమస్యపై కమిటీ వేస్తామనడం కాలయాపన కోసమే అని బండారు ఆరోపించారు. అదానీని కలిసినపుడు డేటా సెంటర్ పూర్తి చేయాలని ఎందుకు అడగలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పెట్రోలియం యూనివర్శిటీ స్ధలం గురించి ఒక్కసారైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. కాగా విజయవాడ కనక దుర్గమ్మ ఫ్లై ఓవర్ ఓపెనింగ్ సందర్భంగా సిఎం జగన్ నితిన్ గడ్కరీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిన సంగతి తెలిసిందే.