గడిచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలలో భారీగా వరదలు ముంచెత్తాయి. దీని ప్రభావంగా 4450 కోట్లు రూపాయల మేరకు ఆస్తులు మరియు పంట నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ విధంగా భారీగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ జగన్ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఈ వరదలకు సంబంధించి వరద సహాయక కార్యక్రమాలు చేపట్టాలన్నా, తిరిగి సాధారణ పరిస్ధితులు రావాలన్నా కేంద్రం వెంటనే రూ. వెయ్యికోట్లు మంజూరు చేయాలంటూ లేఖలో అభ్యర్ధించారు. అంతేకాకుండా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నడూ లేని విధంగా నష్టాలను అంచనా వేయటానికి కేంద్ర బృందాలను  ఇదే సమయంలో  వెంటనే పంపాలని ఈ లేఖలో కోరడమైంది.

వర్షాలు, తుపానుల వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికే జాతీయ విపత్తుల నివారణ సంస్ధ (ఎన్డీఆర్ఎఫ్) ఉన్నది. ఈ సంస్ధ ద్వారా జరిగిన ప్రాణ, పంటల నష్టాన్ని భర్తీ చేయమని ప్రభుత్వాలు కోరుతుంటాయి. ఇక్కడే ఓ అంశం కీలకంగా మారుతుంటుంది. అదేమిటంటే జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల మీద ఆధారపడుంటుంది. ప్రతిపక్షాల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది అందరు చూస్తున్నదే. మరి ఇపుడు కేంద్రప్రభుత్వంతో రాష్ట్రప్రభుత్వానికి మంచి సంబంధాలే ఉన్నయి. నిజానికి అవసరం లేకపోయినా మద్దతు కోరుతున్న కారణంగా పార్లమెంటులో వైసీపీ ఎంపిలు బిజేపీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు.

కాబట్టి ఈ అవకాశాన్ని ఆధారంగా చేసుకుని ఇపుడు రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి జగన్ గట్టిగా కృషి చేయాలి. ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జగన్ కున్న మంచి సంబంధాలు ఏ మేరకు అక్కరకు వస్తాయో చూడాల్సిందే.  దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందన ఇంకా తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: