సెప్టెంబర్ 7వ తేదీన ఘజియాబాద్ నగరం లోని ముస్సూరీ ఏరియాలో ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యింది. అయితే ఆ మహిళ భర్త ముస్సోరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మిస్సయిన మహిళ కోసం ఎన్నో చోట్ల వెతికారు. కానీ తప్పిపోయిన ఆ మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, ఈ క్రమంలోనే తప్పిపోయిన వివాహితకు డాక్టర్ ఇస్మాయిల్ తో పరిచయం ఉందని పోలీసులకు తెలిసింది. అలాగే డాక్టర్ ఇస్మాయిల్ తన ఫోన్ నెంబర్ చేంజ్ చేశారని కూడా పోలీసులకు అర్థమయింది. టెక్నాలజీ సహాయంతో డాక్టర్ ఇస్మాయిల్ ఎక్కడ నివసిస్తారు తెలుసుకున్న పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో ఎంక్వయిరీ చేయడంతో డాక్టర్ ఇస్మాయిల్ తప్పిపోయిన మహిళను చంపినట్టు ఒప్పుకున్నాడు. అతను పోలీసులతో మాట్లాడుతూ తాను తన ప్రియురాలిని హర్యానా రాష్ట్రానికి తీసుకువెళ్లి.. బాగా కొట్టి ఆ తర్వాత విషంతో నింపిన ఇంజక్షన్ తో పొడిచి చంపానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిపై మర్డర్ కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరచడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రియురాలిని కాదని ఇంకొక మహిళను పెళ్లి చేసుకున్న డాక్టర్ ఇస్మాయిల్ తనకు తన ప్రియురాలు అడ్డుగా ఉందని చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.