ఆంధ్రప్రదేశ్ గొడవలు, హత్యలు, అత్యాచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.. గతంలో కొంతవరకు ఇలాంటి ఘటనలు అదుపులో ఉంటే ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత నాలుగు నెలల నుంచి నేరాల రేటు ఆంధ్రా లో ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు అలెర్ట్ గా ఉన్నా కూడా నేరాలు జరుగుతున్నాయి. మరి దారుణం అంటే చిన్న వాటికి కూడా మర్డర్ లు చేసుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన మరో ఘటన చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిందే..



వివరాల్లోకి వెళితే.. కడపలో దారుణం చోటు చేసుకుంది. అరటి పళ్ళ దగ్గర బేరం కుదరలేదని ఓ వ్యక్తి కత్తితో అతి దారుణంగా పొడిచాడు. పండ్లను కొనడానికి వెళ్ళిన ఓ వ్యక్తి పై వ్యాపారి అతని కొడుకు అతి దారుణంగా చంపేశారు.. కడప నగరంలోని బిస్మిల్లా నగర్‌కి చెందిన ఖాజావలి చిలకలబావి వద్ద అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అతని కొడుకు మస్తాన్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. చెకుమార్ ఖాన్ అనే వ్యక్తి అరటి పండ్లు కొనేందుకు వచ్చి బేరమాడాడు.



బేరం ఎంత సేపటికీ కుదరలేదు.. దాంతో ముగ్గురి మద్య మాటా మాటా పెరిగింది.అది చివరికి తీవ్ర విమర్శలు చేసుకొనే వరకు వెళ్ళింది. దాంతో ఒకరి పై మరొకరు అసభ్య పదజాలంతో దూషించారు. స్థానికులు వచ్చి సర్దు మానడానికి ప్రయత్నించినా కూడా వారి మాటలను వీళ్ళు లెక్క చేయలేదు. దీంతో గొడవ చిలికి చిలికి పెద్దది అయ్యింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చెకుమార్‌ఖాన్ అరటిపళ్లు కోసే కత్తి తీసుకుని ఖాజావలి, అతని కొడుకు మస్తాన్‌పై దాడి చేశాడు. ఇద్దరినీ కత్తితో పొడిచేశాడు. స్పందించిన స్థానికులు వెంటనే బాధితులను నగరంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: