ఆంధ్రప్రదేశ్ లో గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఏమోగానీ ఆయనకు సంబంధించి రోజుకో వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. వాస్తవానికి ఆయన చాలా సమర్థవంతమైన నేత కావడంతో ఆయన కోసం రాజకీయ పార్టీలు కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఆర్థికంగా కూడా ఆయనకు చాలా మంచి బలం ఉన్న నేపథ్యంలో ఆయన కోసం బీజేపీ కూడా ఇప్పుడు కాస్త ఎక్కువగానే ప్రయత్నాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఆయనను పార్టీలోకి తీసుకుంటే కొన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది అని భావిస్తుంది.

మరి ఆయన మాత్రం వైసీపీ లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు విషయంలో బీజేపీ గట్టి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఆయనను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తామని బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు అని అంటున్నారు. ఆయనకు విశాఖ జిల్లాలో మంచి క్యాడర్ ఉంది. అంతే కాకుండా ఉత్తరాంధ్రలో కూడా ఆయనకు చాలా మంచి పట్టుంది. ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గం ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఆయనను పార్టీలోకి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని బిజెపి నేతలు కాస్త ఎక్కువగానే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

ఇక గంటా శ్రీనివాసరావు కూడా అటూ ఇటూ కాకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వైసీపీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆయనను మంత్రి చేసే అవకాశం ఉందని చాలామంది వ్యాఖ్యానించారు. ఒకవేళ రాజీనామా చేసినా సరే ఆయనను ఎమ్మెల్సీగా మంత్రిని చేసే అవకాశం ఉందని అన్నారు. కానీ గంటా శ్రీనివాసరావును మాత్రం బీజేపీ తమ వైపు తిప్పుకునే విధంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: