ప్రేమ పేరుతో ఈరోజుల్లో అడ్డదారులు తొక్కుతున్నారు.. అవసరాలకు ప్రేమ అనే పదాన్ని అడ్డుపెట్టుకొని జల్సాలు చేస్తున్నారు. ఒకరి పై మరొకరు ఇష్టాన్ని పెంచుకోవడం తీరా ఆ కార్యం అవ్వగానే మొహం చాటెయ్యడం జరుగుతుంది. అలా జరగడంతో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. లేదా ప్రాణాలను తీస్తున్నారు.. మెట్రో నగరాల్లో ఇలాంటి ప్రేమలు ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో యువత పొద్దున లేచినప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నారు. కామ కోరికలను తీర్చుకోవడానికి ప్రేమను వాడుకుంటున్నారు.. ఇటీవల హైదరాబాద్ ను కుదిపేసిన వర్షాలకు ప్రజలు కోలుకోలేదు.. ఇప్పుడు పాతబస్తీ లో దారుణం జరిగింది.



పాత బస్తీ లో  మదీనా నగర్‌కి చెందిన ముస్తఫా, నారాయణ్‌ఖేడ్‌కి చెందిన రాధిక కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్దలకు తెలియకుండా రాసలీలలు చేశారు. ఒకరి పై మరొకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. విచ్చల విడిగా హైదరాబాద్ మొత్తం చక్కర్లు కొట్టారు.  ప్రేమ పక్షుల్లాగా తిరిగారు. ఇక తిరగడం ఎందుకు పెళ్లి చేసుకుందాం అని గత కొంతకాలంగా ప్రియురాలు కోరింది. దానికి ఆతను మాట మారుస్తూ వచ్చాడు. మాయ మాటలు చెప్పి తప్పించుకొని తిరిగేవాడు. ఇక ప్రియురాలు అతన్ని వదల్లేదు.. మొండికి కూర్చుంది.



పెళ్లి చేసుకోవాలంటూ రాధిక నిలదీయడం తో ప్రియుడు ముస్తఫా, అతని అన్న జమీల్ ఇంట్లోకి తీసుకెళ్లి కనికరం లేకుండా దారుణంగా చంపేశారు. ఆమెను కత్తి తో పొడిచి కిరాతకంగా హత్య చేశారు.  స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితులను రెయిన్ బజార్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం రాధిక మృతదేహాన్ని నారాయణ్‌ ఖేడ్‌కి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలను పోలీసులు తెలియజేస్తామని చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి: