పెళ్లి అనేది నూరేళ్ళ పంట అని అంటారు.. పాతికేళ్ళు తల్లి దండ్రులు సంరక్షణ లో పెంచుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. పెళ్లి చేసినప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేస్తారు. అలాంటి జంటలు కొంతమంది సుఖంగా ఉంటారు.. మరి కొందరు మనస్పర్ధలు కారణంగా విడిపోతారు. కొందరు ఒకరి పై మరొకరు ఆరోపణ చేసుకుంటూ దూషించుకుంటూ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. క్షణికావేశంలో ప్రాణాలను కోల్పోతున్నారు. 



ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి ఘటనే జరిగింది. భర్త మీద కోపంతో బిల్డింగ్ నుంచి దూకి బలవంతంగా ప్రాణాలను తీసుకున్నారు.. పెళ్ళైన ఆరు నెలలకే చనిపోవడం అమానుషం జరిగింది. కరీంనగర్ కు చెందిన శ్రీ విద్య వరంగల్‌కి చెందిన శబరీష్‌తో ఐదు నెలల కిందట వివాహం జరిగింది. ఇటీవల ఉద్యోగరీత్యా భర్త బెంగళూరు వెళ్లడంతో ఆమె చందానగర్‌లో ఉంటున్న వారింటికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో భర్తతో ఫోన్ మాట్లాడుతూ గొడవపడినట్టు తెలుస్తోంది. అలా వారిద్దరి మద్య తరచూ గొడవలు పడుతూ వుంది. 



తల్లి దండ్రులు చేసిన పెళ్లి కావడం తో అమ్మాయి ఏం జరిగిన కూడా చెప్పేది కాదని అర్థమని అవుతుంది. మాటా మాటా పెరిగి గొడవ ముదిరింది.దాంతో కోపంతో రగిలి పోయిన శ్రీ విద్య  క్షణికావేశంలో బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి అమాంతం దూకేసింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కూతురి మరణవార్త తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.భర్త శబరీష్ వేధింపుల కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..మృతురాలి బంధువుల ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త శబరీష్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: