డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఆయన కుమారుడు హంటర్ నిర్వహిస్తున్న వ్యాపారాల్లో అవినీతి లావాదేవీలు జరిగాయంటూ ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించిన కథనం కలకలం రేపింది. హంటర్ ఈ మెయిల్లోని సమాచారాన్ని ఇందుకు ఆధారంగా తీసుకున్నట్టు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. హంటర్కు చెందిన పాత కంప్యూటర్ను హ్యాక్ చేయటం ద్వారా లభించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. నిర్ధారణ కాని ఆ ఖాతాలో సమాచారం ప్రామాణికం కాదని.. పలు విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన లింకులు బ్లాక్ అయ్యాయి. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.
తన ప్రత్యర్థి జో బైడెన్ ను విమర్శిస్తూ ప్రచురించిన ఈ కథనాన్ని ఈ రెండు మాధ్యమాలు కావాలనే సెన్సార్ చేశాయని అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. కాగా నిజానిజాలను నిర్ధారించుకోకుండా తాము ఈ కథనానికి సంబంధించిన లింక్లను పోస్ట్ చేయలేమని సోషల్ మీడియా వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా తన నిర్ణయాన్ని బయటకు ప్రకటించకపోవటంతో.. ఆ వార్తను షేర్ చేయటానికి ప్రయత్నించి విఫలమైన యూజర్లు అయోమయానికి గురయ్యారు.
ఈ పరిస్థితిపై స్పందించిన సదరు సోషల్ మీడియా యాజమాన్యం.. తాము సంస్థ నిబంధనల ప్రకారమే ఈ చర్య తీసుకున్నప్పటికీ.. తగిన వివరణ ఇవ్వకుండానే అలా చేయటం ఆమోదనీయం కాదని అంగీకరించింది. హ్యాకింగ్ కథనాలపై తాము స్పందించే వైఖరిలో మార్పులు చేస్తూ ఆ సోషల్ మీడియా తాజాగా నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపంలో ఉన్న తరుణంలో ఈ చర్య ప్రాముఖ్యతను సంతరించుకుంది.