తెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోతున్నాయి... ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం రోజు రోజు కు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే గ్రేటర్, దుబ్బాక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగా అక్కడ ప్రచార పర్వం ఇప్పటికే మొదలైపోయింది చెప్పొచ్చు. అన్ని పార్టీ లు తమ తమ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోగా అభ్యర్థుల ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.. అధికార పార్టీ కి ఈ ఎన్నికల పై పెద్దగా టెన్షన్ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య భీక పోరు జరగనున్నదన్నది వాస్తవం..

గ్రేటర్ ఎన్నికల బాధ్యత ను కేటీఆర్ కి అప్పగించిన కేసీఆర్ పూర్తి గా వదిలేయకుండా ఆ ఎన్నికల్లో గెల్వద్నికి వ్యూహాలను సిద్మ్ చేస్తున్నారు.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతీ సారి చట్టాలు మార్చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సారి కూడా ఇదే పని చేస్తున్నాడట.. గతంలో పంచాయతీ ఎన్నికలప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చారు. మున్సిపల్ ఎన్నికలు పెట్టాలనుకున్నప్పుడు మున్సిపల్ చట్టాన్ని మార్చారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల కోసమూ చట్టాల్ని మార్చాలనుకుంటున్నారు. అయితే ఎన్నికల టెన్షన్ ఎలా ఉన్నా కేసీఆర్ కి కొత్త తలనిప్పులు మొదలవుతున్నాయట..

తెలంగాణలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో బ్లాస్టింగ్ జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ దుమారం కూడా ప్రారంభమయింది. ఆ ప్రాజెక్టును చూసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణలను పోలీసులు మధ్యలోనే అరెస్ట్ చేశారు. మునిగిపోయిన ప్రాజెక్ట్‌ను చూస్తే తప్పేమిటని… విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం నుంచి నీరు తీసుకునేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎల్లూరు వద్ద ఉంది. ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం నిర్మిస్తోంది. ఈ పథకంలో భాగంగా పంపుహౌస్‌తో పాటు అప్రోచ్‌ చానల్‌ ఎల్లూరు ఎత్తిపోతలకు సమీపంలోనే నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: