ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీలో వచ్చే ఎన్నికల మీద గెలుపు ఆశలు పెరుగుతున్నాయట. ఏడాదిన్నర పాలనను వైసీపీ పూర్తి చేసుకుంది. జగన్ తొంబై శాతం పైగా హామీలను నెరవేర్చారు. ఇక వైసీపీలో కొత్త సినిమా చూపించేందుకు కూడా ఏమీ లేదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట. అదే సమయంలో జగన్ తీసుకుంటున్న కొన్ని అసాధారణ నిర్ణయాల వల్ల కూడా ఆయన చిక్కుల్లో పడతారు అని టీడీపీ ఊహిస్తోంది.
ఏపీ ప్రజలు శాంతికాముకులని, వారు దూకుడు చర్యలను ఎపుడూ సహించబోరని కూడా ఆ పార్టీలో విశ్లేషించుకుంటున్నారుట. ఇక మరో విషయం ఏంటి అంటే చంద్రబాబు నుంచి తమ్ముళ్ళ వరకూ అంతా ఒక విషయం కచ్చితంగా నమ్ముతున్నారుట. జగన్ ఒక్క చాన్స్ అని అడిగారు కాబట్టే ఏపీ జనం సెంటిమెంట్ గా జగన్ని గెలిపించారు అన్నదే పసుపు శిబిరం భావన. ఆ సెంటిమెంట్ ని తన అమిత బలంగా ఊహించుకుని జగన్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని ఫలితాలు, పర్యవసానాలు 2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ చవిచూస్తుందని కూడా అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ గెలుపు ఖాయమని టీడీపీ గట్టిగానే నమ్మకాలు పెట్టుకుందిట. రానున్న రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్..