సమాజంలోనే కాదు ఇంట్లోనూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక తల్లిదండ్రులు లేని బాలికను చేరదీసి యోగక్షేమాలు చూడాల్సిన అత్త వరసైన మహిళ నీచానికి పాల్పడింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లాలో ఓ అత్త కూతురు వయసుండే కోడలితో వ్యభిచారం చేయించింది. ఆమె గర్భం ధరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే బర్మా క్యాంప్‌లో ఉంటున్న ఓ వృద్ధురాలు తన 17 ఏళ్ల మనవరాలితో జీవనం సాగిస్తుంది. అయితే మర్రిపాలెం సాయినగర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధురాలి కోడలు బాలిక బాధ్యతను తాను చూసుకుంటానని ఆమెను నమ్మించింది. ఇక ఫిబ్రవరిలో తనతో తీసుకెళ్లి తిరిగి సెప్టెంబరులో అమ్మమ్మ చెంతకు తీసుకొచ్చింది.

అయితే బాలిక ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు డాక్టర్లు పరీక్షలు చేయగా బాలిక గర్భవతి అని తేల్చి చెప్పారు. ఈ విషయం చైల్డ్ ‌లైన్‌కు చేరడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు బయటికి వచ్చాయి. ఇక వృద్ధురాలి కోడలు, వర్మ అనే వ్యక్తి కలిసి బాలికతో వ్యభిచారం చేయించినట్లు పేర్కొన్నారు. పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసును దిశ పోలీసులకు అప్పగించారు. దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ దర్యాప్తు చేస్తున్నారు. బాలిక అత్తను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: