బీజేపీ వన్నీ గోబెల్స్ ప్రచారాలు అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గోబెల్స్ బతికుంటే దుబ్బాకలో బీజేపీ ప్రచారాలను చూసి ఉరి వేడుకుంటుండే అన్నారు. సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ప్రచారాలు, నాయకులు కార్యకర్తలు చేస్తున్నవన్ని బోగస్ అని మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు వీటిని గమనించాలి అని ఆయన సూచించారు. 3 కోట్లతో టౌన్ హాల్ నిర్మాణానికి మంజూరు అయితే నిర్మించకుండానే నిధులు మింగేశారని ఆరోపణలు పచ్చి అబద్ధాలు ని అన్నారు. అసలు ఆ టెండరే పూర్తి కాలేదు.. మూడు రూపాయలు కూడా దానికి మంజూరు కాలేదు అని అన్నారు.

చేర్వాపూర్- దుంపల పల్లి రోడ్డు కు కేవలం దెండర్లు పిలిచాం అంతే అన్నారు. బీడీ పెన్షన్లలో 1600 మోడీ, 400 మాత్రమే రాష్ట్రం ఇస్తున్నట్లు బిజీపి దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ తో పాటు 17 రాష్ట్రాల్లో ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు అని ఆయన మండిపడ్డారు. దుబ్బాకలో టిఆర్ఎస్ గద్దె కూల్చారని చెప్పి సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పై తిరగబడ్డ కార్యకర్తలని శ్రీనివాస్ నాయక్ అనే బిజెపి కార్యకర్త పోస్టింగ్ పెట్టాడని... ఇది పచ్చి అబద్ధం అని అన్నారు.

ఇవి కల్వకుర్తి లో రెండేళ్ల క్రితం టిక్కెట్ల కేటాయింపు సందర్బంగా జరిగిన చిన్న ఘటనను తిసుకొచ్చి, దుబ్బాక కు లింక్ చేసి ఈ పోస్టింగ్ పెట్టారన్నారు. దీనిపై టిఆర్ఎస్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి పోలీసులు శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. బీజేపీ ఇట్లా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నదని అన్నారు. బీజేపీ నేతలు ఈ ప్రచారాలను నిరూపిస్తారా ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసురుతున్న ? దమ్ముంటే మీరు చేస్తున్న ప్రచారాలను నిరూపిస్తే, బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే నా ఆర్ధికశాఖ మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: