పూర్తి వివరాలు తెలుసుకుంటే.. పటేపూర్ లోని మౌదాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని మమతా కంబైండ్ స్టడీస్ చేయడానికి సమీపంలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళేది. ఒక రోజు ఆమె స్నేహితురాలు ఇంట్లో లేదని తెలిసింది. ఐతే తన స్నేహితురాలి కోసం అక్కడే వెయిట్ చేయడం ప్రారంభించింది మమత. అప్పుడు స్నేహితురాలి తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంట్లో మమతను ఒంటరిగా కనిపించడంతో ఆమె పై తన లైంగిక వాంఛను తీర్చుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మమతాపై అత్యాచారం చేశాడు ఆ నీచుడు.
ఆ తర్వాత ఆమె తన సోదరులను దీని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ సంఘటన తరువాత బాగా భయభ్రాంతులకు గురైన మమత పుట్టెడు దుఃఖంతో తన ఇంటికి ఎలాగోలా చేరుకుంది. ఆరు నెలల తర్వాత ఆమె శారీరకంగా బలహీనపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు వైద్య పరీక్ష చేసి ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని వెల్లడించారు. దాంతో ఒక్కసారిగా షాక్ ఆయన కుటుంబ సభ్యులు ఆ తర్వాత తేరుకుని నిందితుడిపై హాజీపూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.