రెండు నాల్కల ధోరణి కి వందకు వంద శాతం న్యాయం చేకూరేటట్లు మాట్లాడే చంద్రబాబు తాను చేస్తే అభివృద్ధి అదే పని ఇతరు లు చేస్తే మోసం అన్నట్లు వ్యవహరిస్తున్న ఆయన తీరును చూస్తుంటే ఇంకేమని విమర్శించాలో అర్థం కావట్లేదు.. తాను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను అన్యాయంగా తన పార్టీ లోకి చేర్చుకుని కనీస రాజకీయ విజ్ఞత లేకుండా ప్రదర్శనుంచి ఇప్పుడు రాజీనామా చేస్తేనే గానీ పార్టీ లోకి రావద్దు అని కండిషన్ పెట్టిన జగన్ టీడీపీ వారిని వైసీపీ లోకి చేర్చుకుంటే బాబు కి అది మోసం అనిపిస్తుంది.. ఏది మోసమో, ఏది నిజాయితో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు..
ఇక ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు చేస్తున్న వింత వింత చేష్టలకు ఒకవిధంగా ప్రజలకు నవ్వొస్తుంది.. అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులకు అధికారాలు ఇస్తూ జబర్దస్త్ స్కిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుల ఎంపికను కూడా చంద్రబాబు చేశారు. జంబో జెట్ లాంటి పొలిట్ బ్యూరో లో మొత్తం 25 మంది సభ్యులను నియమించారు. సీనియర్ నేతలందరికీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమ, ఫారూక్, గల్లా జయదేవ్, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి వంటి వారిని నియమించారు. పవర్ లో లేని ఈ అధికారాలు ఇచ్చి ఏం లాభం అని వైసీపీ వర్గాలు హేళన చేస్తున్నాయి.