జగన్ ప్రభంజనం ఎలా వుంది అంటే టీడీపీ కి పెట్టని కొత్తగా మిగిన ప్రాంతాలని వైసీపీ కి దాసోహం అయ్యాయి.. టీడీపీ పునాదులు కదిల్చేలా జగన్ సాధించిన ఈ విజయం కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది.. ఎంతో బలంగా ఉందన్న పార్టీ ఇలా అయిపోయేసరికి పసుపు వీరులు పసుపు తడిగుడ్డ వేసుకుని కూర్చున్నారు.. ఇక అధినేత చంద్రబాబు అయితే ఎంత దారుణంగా కుమిలిపోయాడో చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా అయన కొడుకు లోకేశుడు ఓడిపోయినందుకు బాబు దుఃఖం పొంగిపొరలిపోతుందట.. అనేక నియోజక వర్గాల్లో పార్టీ సృష్టించిన ఓటుబ్యాంకు ఒక్కసారిగా ఇంకో పార్టీ కి వెళ్లిపోవడంతో టీడీపీ దాన్ని తిరిగి ఎలా సాధించుకోవాలని తర్జనభర్జనలు పడుతుంది..
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల సంగతి అందరికి తెలిసిందే.. ఇటీవలే జగన్ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే..ఈ చర్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా లేఖ రాయడం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని, దానిని బెదిరించడమేనని విపక్ష తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. లేఖ రాయడంలో తప్పేమీ లేదని, దానిని బహిరంగపరచడంపైన కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ లేఖ రాష్ర్ట, జాతీయ రాజకీయాల్లో, న్యాయవాద వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. న్యాయవాద వర్గాల నుంచి ప్రభుత్వ చర్యకు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా మరి కొందరు పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారు. మరోపక్క లేఖ తదుపరి చర్యలపై అంతా ఆసక్తి కనబరుస్తున్నారు.