పార్టీలో కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే బిజెపి పై ఎదురుదాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం కొంత మంది నేతలు బీజేపీ ని విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి అడుగులు వేస్తున్నారు. మరి దీనికి కారణం ఏంటి అనేది తెలియదు కానీ బిజెపి ని విమర్శించే విషయంలో మాత్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు అనే భావన సీఎం కేసీఆర్ లో కూడా ఎక్కువగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఆరోపణలు బీజేపీ నేతలు ఎక్కువగా చేస్తున్నారు.
అయినా సరే ఇబ్బంది పెట్టే విధంగా టిఆర్ఎస్ నేతల మాట్లాడకపోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టిఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సరే ఆ పార్టీ నేతలు మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. అసలు బిజెపిని ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన మంత్రులు కూడా విమర్శించే సాహసం చేయకపోవడం గమనార్హం. మొన్నటివరకు మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ టార్గెట్ గా కాస్త ఎక్కువగా విమర్శలు చేసేవారు. అదేవిధంగా ఒకరిద్దరు ఎంపీలు కూడా కాస్త ఘాటుగానే మాట్లాడారు. అయినా సరే ఇప్పుడు కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శించే విషయంలో వెనక్కి తగ్గుతున్నారు.