పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం జిల్లాలోని కొత్తపల్లికి చెందిన వెంకట రమణ అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. వారికీ ఓ కూతురు సంతానం. అయితే ఓ యువకుడు, వెంకట రమణ కూతురు మూడేళ్లుగా ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. ఈ తరుణంలో ఈ నెల 13వ తేదీన ఆ యువకుడు వెంకటరమణ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో యువకుడిపై వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న కూతురు ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తండ్రి అని కనికరం కూడా చూపించకుండా క్షణికావేశంతో ఓ నిర్ణయం తీసుకుంది. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్లి కూతురు తన తండ్రిపై కేసు పెట్టింది. దీంతో వెంకట రమణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కూతురే తనపై కేసు పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరమణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.