వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన గుంటూరు లో చోటు చేసుకుంది.. నగరానికి చెందిన ఇద్దరు భార్యా భర్తలు ఉన్నారు.. వాళ్లకు 2015 లో పెళ్లి జరిగింది. పెద్దల సమక్షంలో పెళ్లి జరగడం తో అన్నీ అనుకున్నట్లుగానే అతనికి అందాయి. దాదాపు ఆరు ఏళ్ళు వీరి సంసారం సాఫీగా సాగిోతుంది. ఈ ఆరేళ్ల లో వీరి సుఖ కాపురానికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు.. కట్టుకున్న భార్యను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో భర్త నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టాక నల్లగా ఉన్నావంటూ సూటి పోటి మాటల తో హింసించడం మొదలుపెట్టాడు..
ఓ రోజు ఆమెను చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఏం చేయాలో తెలియని మహిళ పోలీసులను ఆశ్రయించారు.. భర్త నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది.. తనను కిరోసిన్ డబ్బాతో బెదిరించినట్లు పోలీసులకు చెప్పింది. ఆ దీన గాథ విన్న అర్బన్ ఎస్పీని కలసి తన గోడు వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఎస్పీ ఆమె సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.భర్తను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. విషయం అమ్మాయి తల్లి దండ్రులకు తెలిసింది. వారు కూతురు కాపురం ఇలా అయ్యిందేంటి అంటూ బాధపడ్డారు. అల్లుడిని వడలోద్దని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు..