అమరావతి: వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో నడిచే ఆంధ్రజ్యోతి పత్రికను, రాజగురువు రామోజీరావు సారథ్యంలో నడిచే ఈనాడు పత్రిక మోసగించింది. ఎల్లో పత్రికలుగా చలామణీ అవుతున్న ఈ రెండు పత్రికల్లో వార్తల ప్రాధాన్యం, వార్తల విస్మరణ అంతా కూడబలుగుతున్నట్టు జరుగుతుంది. అంతెందుకు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ రాసిన లేఖకు ఈ రెండు పత్రికల్లో స్థానం దక్కలేదు. కానీ ఆ ఫిర్యాదుపై కౌంటర్లకు మాత్రం ఎక్కడా లేని ప్రాధాన్యం లభిస్తోంది. అలాంటి కౌంటర్ వార్తకు ఈనాడులో బ్యానర్ కట్టగా ఆంధ్రజ్యోతి మాత్రం మిస్ కావడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వార్త విషయంలో ఆంధ్రజ్యోతిని ఈనాడు మోసం చేసిందనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఈనాడులో న్యాయవ్యవస్థపై దాడిని చూస్తూ ఊరుకోవద్దు అనే శీర్షికతో ఒక పెద్ద వార్తను క్యారీ చేశారు. ఈ వార్త పాపం ఆంధ్రజ్యోతికి ఇవ్వకుండా ఎన్టీఆర్ భవన్ వంచించింది అని చెప్పవచ్చు. జగన్ లాంటి వాళ్లను ఉపేక్షిస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలుగుతుందని, కావున కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సీజేకు వంద మంది న్యాయశాస్త్ర విద్యార్థులు లేఖ రాసిన కథనాన్ని ఈనాడు మాత్రమే క్యారీ చేసింది.

ఊరు, పేరు లేని న్యాయశాస్త్ర విద్యార్థులు రాసిన లేఖ మాత్రం చాలా ఘాటుగా ఉంది. న్యాయమూర్తులపై దాడిని ఉపేక్షిస్తే న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం కలుగుతుందని.. ఆ పరిస్థితి రానీయొద్దని న్యాయశాస్త్ర విద్యార్థులు కోరారు. మేం దేశంలోని వివిధ న్యాయశాస్త్ర కళాశాలలకు చెందిన విద్యార్థులం. ప్రజాస్వామ్య మూల స్థంభాలను కాపాడటానికి న్యాయవ్యవస్థ స్వతంత్రత చాలా అవసరమని తరగతి గదుల్లో మాకు బోధించారు. పౌరుల ప్రాథమిక హక్కులను  సంరక్షించి కాపాడేది న్యాయవ్యవస్థే అని ప్రజా విశ్వాసమే దానికి పునాది అని స్పష్టం చేశారు. మరి ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు లేఖ రాయడం న్యాయవ్యవస్థపై దాడిగా తాము చదువుకున్న ఏ పుస్తకంలో ఏ పేజీలో ఉందో సదరు ఊరు, పేరు లేని విద్యార్థులు చెబితే తెలుసుకుని జనం తరిస్తారు. అయినా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు దేశవ్యాప్తంగా వంద మంది విద్యార్థులు లేఖ రాస్తున్నప్పుడు ఏఏ ప్రాంతం నుంచి ఎవరెవరు అనే వివరాలు పొందుపర్చకుండా ఆకతాయిలు రాసే ఆకాశరామన్న ఉత్తరాలులా ఏంటీ పని.. మరి రాజ్యాంగం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు హక్కులు కల్పించిందా లేదా?

కేవలం న్యాయశాస్త్ర విద్యార్థులకు, ఆ రంగంలోని వారికి మాత్రమే ప్రత్యేక రాజ్యాంగం హక్కులు, బాధ్యతలు కల్పించిందా? జగన్ కు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఏమైనా ఉన్నాయని న్యాయశాస్త్ర విద్యార్థులుగా భావిస్తుంటే వాటిని కాపాడాల్సిన బాధ్యత న్యాయశాస్త్ర విద్యార్థులపై లేదా? ఇదేనా రాజ్యాంగం ప్రస్తావించిన హక్కులను సజీవంగా ఉంచడమంటే? అసలు ఏపీ హైకోర్టు స్వతంత్రంగా వ్యవహరించలేదు అనేదే కదా ముఖ్యమంత్రి ఆవేదన. ఆయన ఆరోపణలపై విచారణ జరపకుండా తామన్నింటికి అతీతం అన్నట్టు వ్యవహరించడం వల్ల చివరకు ఏం సాధిస్తారో న్యాయశాస్త్ర విద్యార్థులే ఆలోచించాలి. ఆ విషయమై ప్రజలకు సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: