హైదరాబాద్ కు పెద్ద ఎత్తున  విరాళాలు వస్తున్నాయి. సినీ హీరోలు, ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు అందరూ కూడా భారీగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా హైదరాబాద్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  హైదరాబాద్ వరద బాధితులకు టాలీవుడ్ స్టార్ హీరోలు సహాయం చేయడానికి ఆసక్తి చూపించారు. ఇక పలు వ్యాపార సంస్థలు కూడా సహాయం చేసాయి.

ఇక తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ  మై హోమ్స్ కూడా సహాయం భారీగా చేసింది. ఏకంగా 5 కోట్ల విరాళం ప్రకటించింది. సిఎం సహాయ నిధికి ఈ విరాళం ఇస్తున్నామని మై హోమ్స్ ప్రకటన చేసింది. కాసేపటి క్రితం దీనికి సంబంధించి సంస్థ అధికారులు ప్రకటన చేసారు. ఇప్పటికే హైదరాబాద్ కు  తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహాయం చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: