ఆంధ్ర ప్రదేశ్ లో నేరాలు పెరుగుతున్నాయి. పోలీసులు నేరాలకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.అయిన కూడా  ఇక్కడ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు విజయవాడలో ఈ ఘోరాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న జరిగిన ప్రేమోన్మాది గొంతు కోసిన ఘటనలు పూర్తి కాకుండా మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు భార్యను అడ్డు పెట్టుకొని కిరాతాకానికి పాల్పడ్డాడు.. భార్యను ఏడ్పిస్తున్నాడని దారుణానికి పాల్పడ్డాడు..



అసలు విషయానికొస్తే.. ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాత సామెత.. కానీ కొన్ని నేరాలు చేయాలంటే ఇలాంటివి తప్పక పాటించాలి.. ఆ సామెతకు తగ్గట్లు ఇప్పుడు ఒక ఘటన జరిగింది. ఓ భార్యను వేధిస్తున్నాడని తెలుసుకున్న భర్త ఎంతో తెలివిగా వ్యవహరించి అతని పీడను వదిలించుకున్నారు. ఈ ఘటన విజయవాడ లో చోటు చేసుకుంది. విజయవాడ లో జరిగే ఇలాంటి హత్యలకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.



విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన వివాహిత మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. అసభ్య పదజాలం తో నీచంగా మాట్లాడుతుండడం తో ఆమె భర్తకి చెప్పింది.ఈ విషయం పై కన్నెర్ర చేసిన భర్త అతన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. ఈ మేరకు ఓ పథకాన్ని కూడా వేశాడు.. ఆగ్రహం తో రగిలిపోయిన భర్త ఆమెతోనే పిచ్చయ్యకి ఫోన్ చేసి పటమటలోని స్టెల్లా కాలేజీ వద్దకు నమ్మకంగా పిలిపించాడు. పిచ్చయ్య రాగానే కత్తితో పొడిచేశాడు. తీవ్రగాయాలపాలైన పిచ్చయ్యని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకొని నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు.. భార్య చెప్పిన విషయాలను పరిగణన లోకి తీసుకున్న పోలీసులు అతనికి నెల రోజులు జైలు శిక్ష వేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: