ముఖ్యంగా మహిళా సంఘాలను కోపానికి గురిచేసింది. హాత్రాస్ లో జరిగిన దళిత యువతి అత్యాచారం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు నిర్వహించారు.. మరోవైపు మానవహారాలు చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఈ కేసును సీబీఐ కి అప్పగించారు.. ప్రస్తుతం వాళ్ళు ఈ కేసును అన్నీ కోణాల్లో పరిశీలిస్తున్నారు. మహిళల కోసం యూపీ ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. అమ్మాయిలు తమ దగ్గర కత్తులను ఉంచుకోవాలని, అవసరమైనపుడు వాటిని ఉపయోగించాలని ఆ మంత్రి పిలుపు నిచ్చారు. అందరి ముందు మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం కాస్త దుమారం రేపుతుంది.
లలిత పూర్ లో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి మనోహార్ లాల్.. మహిళలంతా కత్తులు పట్టాలని సలహా ఇచ్చారు. అంతేకాదు, అవసరమైన సందర్భాల్లో మహిళలు కత్తులతో దాడులకు దిగాలని సూచించారు.మహిళలు ఆందోళన చెందవద్దని, రాష్ట్రమంతా వారికి అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యల పై కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ తీవ్రంగా ఖండించారు. ఓ మంత్రి అయ్యి ఉండి ఇలా మాట్లాడటం దారుణమని ఆయన అన్నారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక చర్చలకు దారి తీసింది. మరి ఈ విషయం ఎక్కడికి వెళుతుంది చూడాలి..