మన తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా బలపడటానికి లేవు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బలపడడానికి ప్రతి అవకాశాన్ని వాడుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మీద తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఇక్కడ ఉన్న నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రజల్లో మద్దతు తెచ్చుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తెలుగు రాష్ట్రాలకు ఏదో ఒక సహాయం చేసి తమ వైపు తిప్పుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు బలపడటానికి సినీ నటులను కూడా వాడుకునే విధంగా బిజెపి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాల మీద ఆసక్తి ఉన్న కొంతమంది సినీ నటులు తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి పెద్దలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి చిరంజీవి అక్కినేని నాగార్జున వంటి హీరోలను బీజేపీ లోకి తీసుకొని వెళ్లే విధంగా బిజెపి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే వాళ్లు వెళ్తారా లేదా అనేది తెలియదు కానీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విషయంలో వారి సహకారం తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబుతో కేంద్ర ప్రభుత్వం సంబంధించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర సమాచార శాఖ మహేష్ బాబు తో కొన్ని ఆరోగ్య శాఖకు సంబంధించిన పథకాలను ప్రచారం చేయించే విధంగా ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది తెలియదు. ఇక కొంత మంది మహిళ నటులను కూడా తమ వైపు తిప్పుకునే విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: