అమరావతి: గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కు ఉన్న పాపులారిటీతో ఆయనపై నమ్మకం ఉంచారు. ఆ తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా అందరికి తెలిసిందే. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధాన అంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నా కూడా జగన్ అనుకున్నది సాధించి తీరారు. ఇదిలా ఉంటే.. అధికారంలోకి వచ్చాక జగన్ రాష్ట్రంలో చేసిన పనులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేసినవే. ఇప్పుడు ఆ పనులు చేస్తే వెంటనే ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తులో ఆ పనితనం తప్పక తెలుస్తుంది. పరిశ్రమల విషయంలో జగన్ ఆచితూచి అడుగులు వేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల విషయంలో ఎంతో క్లారిటీగా వ్యవహరించారు.

రాష్ట్ర అభివృద్ధికి మూలాలు స్థానికంగానే ఉంటాయని నమ్మి.. స్థానిక సంస్థలను ప్రోత్సహిస్తూ ఆయన వస్తున్నారు. ఇది ఎందరో మేధావులు తేల్చిన నిజం. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టిన జగన్.. తాజాగా కార్పొరేషన్ ను, మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని.. ఆ డబ్బును మెరుగైన సేవలు అందించేందుకు, అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చుచేస్తామని సంచలన ప్రకటన చేశారు. దీనిపై ఇప్పటికే పలు సూచనలను జగన్ అధికారులకు అందజేయగా.. మున్సిపాలిటీ ఆదాయమెంత, వ్యయమెంత.. జీతాల కోసం అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు.. తదితర విషయాలన్నీ తెలుసుకుని ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్ ఓపీ రూపొందించి దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఇప్పటివరకు సంక్షేమ పథకాల్లో మార్క్ పాలన చూపించిన జగన్.. ఇప్పుడు అభివృద్ధిలో తనదైన స్టైల్ ను చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: