ఆంధ్ర ప్రదేశ్ దారుణాలకు నియలయంగా మారుతుంది అనడానికి నిదర్శనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు, లైంగిక దాడులు.. అమ్మాయిలను ఎప్పటికప్పుడు కాపాడటానికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపడుతున్నారు..అవి కొంతవరకు మాత్రమే కాపాడటానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దాడులు, అత్యాచారాలు, హత్యలు కామన్ అయిపోయాయి. విజయవాడలో అమ్మాయిల పై దాడులు పెరుగుతున్నాయి. అంతేకాదు పోలీసులను సైతం ఆశ్చర్య పరిచేలా ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి..



గుంటూరులో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.ఆమె మరొకరితో కూడా సన్నిహితంగా ఉంటోందని తెలిసి తిరిగి ఇంటికి చేరాడు. అప్పటిదాకా కలసి ఉన్న ప్రియుడు భార్య దగ్గరికెళ్లి పోవడంతో ప్రియురాలు వేధించడం మొదలుపెట్టింది. తనకు డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో భరించలేక యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. నగరంలో ట్రైలర్ గా పనిచేస్తున్నాడు.. అతనికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.



అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది.. అది కాస్త వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్యబిడ్డలను పట్టించుకోకుండా కొద్ది కాలం ఆమెతో సహజీవనం చేశాడు. అయితే ఆమెకు మరొకరితో కూడా సంబంధం ఉందని తెలియడం తో తిరిగి భార్యాబిడ్డల దగ్గరికి వచ్చేశాడు.ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే అందరికీ చెబుతానని బెదిరించింది.. దీంతో అతను భయపడి పోయాడు.. మనస్తాపానికి గురయ్యాడు.. అయితే డబ్బుల కోసం ప్రియురాలు, ఆమె కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేయడంతో తీవ్రమనస్థాపానికి గురైన మస్తానయ్య ట్రైలర్ షాప్ లో ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ కేసు కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: