ఇస్లామిక్ దేశాలకు నాయకత్వం వహించాలని గట్టిగా కోరుకుంటున్నాయి. ఒక సమస్యపై సౌదీ అరేబియా స్పందించినప్పుడల్లా టర్కీ దానిని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తుంది.
మక్కా తమదేశంలోనే ఉందని, మహ్మద్ ప్రవక్త ఇక్కడే జన్మించారని, అందువల్ల ఇస్లామిక్ దేశానికి నాయకత్వం వహించాలని సౌదీ భావిస్తోంది. అయితే సౌదీ అరేబియాకంటే తానే శక్తివంతమైన దేశాన్ని కాబట్టి ముస్లిం రాజ్యాలకు తానే నిజమైన నేతనని టర్కీ భావిస్తోంది.
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ హత్యకు వ్యతిరేకంగా టర్కీ తీవ్రంగా స్పందించింది.ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగాలేవని, మధ్య ప్రాచ్యంమీద పట్టు కోసం రెండు దేశాలు కుమ్ములాటను వేగవంతం చేశాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆ రెండు దేశాల నుంచి వస్తున్న ప్రకటనలు వారి దౌత్య సంబంధాలను ఇంతకు ముందుకన్నా భిన్నమైన మార్గంలో నడుస్తున్నాయని చెప్పకనే చెబుతున్నాయి.
టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దవాన్ ఇటీవల చేసిన ఒక ప్రకటనపై సౌదీ అరేబియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా ఖండించింది. టర్కీని అన్ని విధాలుగా బహిష్కరించాలని ఆ సంస్థ ప్రభుత్వానికి, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.“ప్రతిపౌరుడు, వ్యాపారీ, వినియోగదారుడు కూడా టర్కీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అది దిగుమతులు కావచ్చు, ఎగుమతులు కావచ్చు, పర్యాటకం కావచ్చు. టర్కీ మనదేశాన్ని నిరంతరం వ్యతిరేకిస్తోంది. దీనిని మనం తీవ్రంగా పరిగణించాలి’’ అని కౌన్సిల్ ఆఫ్ సౌదీ ఛాంబర్స్ చైర్మన్ అజ్లాన్ అల్ అజ్లాన్ ట్వీట్లో పిలుపునిచ్చారు. ఈ రెండు దేశాల మధ్య ఆదిత్య యుద్ధం కొనసాగి నట్లయితే ఇస్లామిక్ రాజ్యాలు ఎటువైపు ఉంటాయో కొద్దిరోజుల్లో తేల్చుకోవాల్సింది.