అనారోగ్యంతో జయలలిత హాస్పిటల్ లో ఉన్నప్పుడు..... ఆమె మేన కోడలు అంటూ దీప ఆస్పత్రికి వచ్చింది.... మొదట ఎవరు నమ్మలేదు కానీ జయలలిత మరణం అనంతరం ఆమెకు ఉన్న భారీ ఆస్తులు ఎవరికి అనే వివాదం చెలరేగింది. జయలలిత మేన అల్లుడు, మేనకోడలు అంటూ దీప, దీపక్ వచ్చారు. కోర్టులో ఎంతగానో పోరాడి చివరికి తమను తాము నిరూపించుకొని...... జయలలిత వారసులుగా హక్కులను చేజిక్కించుకున్నారు. జయలలిత బ్రతికున్న సమయంలో వీరిని కనీసం దగ్గరకు కూడా రానివ్వకపోయినా చివరికి తన ఆస్తులు వీరి సొంతమయ్యాయి. ఎవరినైతే దూరం పెడుతూ వచ్చిందో చివరికి వారే జయలలిత వారసులుగా చలామణి అవుతున్నారు.
ఇటీవలే జయలలిత కు సంబంధించిన వైట్ మనీ ఆస్తులకు దీప, దీపక్ వారసులుగా మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. తాజాగా జయలలిత నివాసం అయిన వేద నిలయానికి సంబంధించిన డబ్బులు సైతం దీప, దీపక్ లు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఇంటిని మ్యూజియంగా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించి ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా ఆ డబ్బులను అయితే కటింగ్స్ ఫోను మిగిలిన మొత్తాన్ని దీప దీపక్ లకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మరో అద్భుత అవకాశం దీప, దీపక్ లకు చేరువయ్యింది.