నార్త్ ఇండియా లో ఆడవాళ్ళ పై ఆఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అత్యాచారానికి గురై ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అయినా కామాంధుల కోరికలు తగ్గలేదు.. అమ్మాయి కనిపిస్తే చాలు అనుభవించడం ,విషయం బయటకు పొక్కకుండా ప్రాణాలను తీయడం ఈ మధ్య ఆ ప్రాంతాల్లో సర్వ సాధారణం అయ్యింది. ఇటీవల యూపీ లో సంచలనంగా మారిన ఘటన హథ్రస్ అత్యాచార ఘటన.. ఎన్నో రాజకీయ చర్చలకు దారి తీసిన ఈ ఘటన పై పూర్తి విచారణ జరగక ముందే యూపీలో మరో  దారుణం వెలుగు చూసింది.. ప్రియుడి మాటను వినలేదని దారుణానికి పాల్పడ్డాడు.



తన ఫ్రెండ్ తో దారుణంగా రేప్ చేయించి అనంతరం ఆమెను చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ఈ అమానుష ఘటన యూపీలోని బారాబంకి జిల్లా లో జరిగింది అయితే ఫ్రెండ్ ను కలిసి వస్తాను అని వెళ్ళిన కూతురు ఇంకా రాకపోవడంతో బయపడిన తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి స్టేషన్ లో మిస్సింగ్ కేసును నమోదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అమ్మాయి సన్నిహితులను,క్లోజ్ ఫ్రెండ్స్ ను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే ఆ అమ్మాయి ఓ అబ్బాయితో సన్నిహితంగా ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో కేసును ముందుకు కదిపారు.



యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇద్దరం కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నామని.. తనను కలిసేందుకు ఇటీవల ఆమె నిరాకరించడంతో చంపేసినట్లు పేర్కొన్నాడు. తన స్నేహితుడితో కలసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి.. అనంతరం ఆమెను కాల్వలో తోసేసినట్లు చెప్పాడు. అమ్మాయి మృత దేహాన్ని గాలించి కాలువలోనుంచి పైకి తీశారు. పోస్ట్ మార్టం కోసం బాడీని ఆసుపత్రికి తరలించారు.గ్యాంగ్ రేప్, హత్య తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. కన్న కూతురికి ఇలాంటి పరిస్థితి రావడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండో సారి ఇలాంటి ఘటన ఇక్కడ జరగడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: