మహిళలు ఇప్పుడు రక్తాన్ని దారపొస్తున్నారు. కామాంధుల చేతిలో నలిగిపోవడం తో పాటుగా , ప్రాణాలను కోల్పోతున్నారు. అమ్మాయిలను కనాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు.. మిగితా కేసులు పక్కన పెడితే అమ్మాయిల పై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నా కూడా కామాంధులు రెచ్చి పోతున్నారు. భారత దేశ వ్యాప్తంగా ఎన్నో హత్యలు, అత్యాచారాలు,. గ్యాంగ్ రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరో ఘటన వెలుగు చూసింది..



ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళను దారి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. ఈ శబ్దాలకు అక్కడకు చేరుకున్న ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి అమ్మాయిని కాపాడాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది. పటియాలాకు చెందిన మహిళ ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ప్రయాణికురాలి పై కన్నేసిన ఆటో డ్రైవర్ సుఖ్‌దేవ్‌ సింగ్ ఆటోని రూటు మార్చి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.



అక్కడ ఎవరు లేకపోవడం తో తన మగతనాన్ని చూపాలని ప్రయత్నించాడు.. వెనుక సీట్లో కూర్చున్న ఆమె వద్దకు వచ్చి వెకిలిచేష్టలు చేశాడు. చేతిలో స్క్రూ డ్రైవర్‌ తో ఆమెను చంపేస్తానని బెదిరించి నీచానికి ఒడిగట్టాడు. ఆమె ప్రతిఘటించడం తో మెడ పై స్క్రూ డ్రైవర్‌తో గాయపరిచి రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ గాయం వల్ల నీచుడి చెర నుంచి తనని తాను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో కేకలు కూడా వేసింది. బాధితురాలు కేకలు విన్న స్థానికుడొకరు ధైర్యం చేసి ఆపదలో ఉన్న మహిళ మానప్రాణాలను రక్షించాడు. లోకల్ హీరో తిరగబడడం తో ఆటోడ్రైవర్ తన ఆటోని అక్కడే వదిలి పారిపోయాడు. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: