చైనా, తమ జవాన్ను తమకు అప్పగించాలంటూ మంగళవారమే భారత్కు విజ్ఞప్తి చేసింది. తప్పిపోయిన తన జడల బర్రెను వెతికిపెట్టాలన్న ఒక స్థానికుడి విజ్ఞప్తి మేరకు ఆ జవాన్ ఆ జడల బర్రెను వెెెతికే క్రమంలో పొరపాటున సరిహద్దు దాటడం జరిగింది. దీంతో సరిహద్దు దాటిన ఆ చైనా సైనికుడిని ఇండియన్ ఆర్మీ సోమవారం దేమ్చోక్ సెక్టార్ వద్ద అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా షీజియాంగ్ ప్రావిన్సుల్లోని షాగ్జింజన్ పట్టణానికి చెందిన పీఎల్ఏకు చెందిన సైనికుడు వాంగ్ యా లాంగ్గా గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రోటోకాల్ను అనుసరించి తిరిగి చైనాకు అప్పగిస్తామని భారత్ హామీ ఇచ్చింది. హామీకి కట్టుబడి భారత సైన్యం చెప్పినట్టుగానే అతడిని చైనా ఆర్మీకి తిరిగి అప్పగించింది. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.
చైనా, తమ జవాన్ను తమకు అప్పగించాలంటూ మంగళవారమే భారత్కు విజ్ఞప్తి చేసింది. తప్పిపోయిన తన జడల బర్రెను వెతికిపెట్టాలన్న ఒక స్థానికుడి విజ్ఞప్తి మేరకు ఆ జవాన్ ఆ జడల బర్రెను వెెెతికే క్రమంలో పొరపాటున సరిహద్దు దాటడం జరిగింది. దీంతో సరిహద్దు దాటిన ఆ చైనా సైనికుడిని ఇండియన్ ఆర్మీ సోమవారం దేమ్చోక్ సెక్టార్ వద్ద అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద లభించిన గుర్తింపు కార్డు ఆధారంగా షీజియాంగ్ ప్రావిన్సుల్లోని షాగ్జింజన్ పట్టణానికి చెందిన పీఎల్ఏకు చెందిన సైనికుడు వాంగ్ యా లాంగ్గా గుర్తించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రోటోకాల్ను అనుసరించి తిరిగి చైనాకు అప్పగిస్తామని భారత్ హామీ ఇచ్చింది. హామీకి కట్టుబడి భారత సైన్యం చెప్పినట్టుగానే అతడిని చైనా ఆర్మీకి తిరిగి అప్పగించింది. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది.