కిడ్నాప్ చేసిన 2 గంటల లోనే దీక్షిత్ హత్య జరిగి ఉండవచ్చు అని ఆయన చెప్పారు. అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్ జరిగింది అని అన్నారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి మెకానిక్ మంద సాగర్ అన్నారు. దొరికిపోతామనే భయంతోనే బాలుడిని చంపేశారు అని ఎస్పీ వివరించారు. సీసీ కెమెరాల లేని ప్రాంతం నుంచి బాలుడిని తీసుకెళ్లారు అని ఆయన చెప్పారు. తెలిసిన వాళ్లు కావడం వల్లే వారితో బాలుడు వెళ్లాడు అని ఆయన చెప్పారు. మంద సాగర్కు సీసీ కెమెరాలు, సెల్ టవర్లు ఎక్కడున్నాయో తెలుసు అని అన్నారు.
బాలుడి కిడ్నాప్కు ముందు రెక్కీ చాలా పక్కాగా నిర్వహించారు అని ఎస్పీ చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించాం అని ఆయన అన్నారు. సాయంత్రం లోగా పూర్తి వివరాలు వెల్లడిస్తాం అని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనిగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేసాడు అని ఆయన వివరించారు. ఇక నిందితులకు త్వరగా శిక్ష పడేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఎన్కౌంటర్ చేసారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.