ఇటీవలే నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన సంచలనంగా మారిపోయింది. ఏకంగా దేశం లో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీంతో ప్రస్తుతం భారత ప్రజలందరిలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. సాధారణంగానే నితిన్ గడ్కరీ ఏదైనా చెప్పారు అంటే అది చేసి చూపిస్తారు అన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాచరణపై.. ఆచరణ పై కూడా అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు.
చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరణలో సాధ్యం చేసి చూపిస్తారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నామని చెప్పడంతో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అస్సాంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ దేశంలోనే మొదటిది ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందట. ఇక ఈ పార్క్ కి వాయు జల రోడ్డు రైలు రవాణా మార్గాలను కూడా ఏర్పాటు చేయనున్నారట. ఒకవేళ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పూర్తి అయితే ఏకంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.