ఎన్సీఈఆర్టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. వెబినార్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్ఆర్డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ తరపున ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. కరోనా సమయంలో ఏపీ తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారట.
అదే సమయంలో సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారట. వీటి గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ వాటిని మెచ్చుకున్నారట. వైయస్ జగన్ తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని అన్నారట.
అంతే కాదు.. సీఎం వైయస్ జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారట. గోరుముద్ద వంటి కార్యక్రమాలతో విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని మెచ్చుకున్నారట. రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్న పోక్రియాల్.. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందన్నారట.
ఏపీలో చేస్తున్నట్టే చేయమని.. ఇతర రాష్ట్రాలకు కూడా చెబుతాం అని కేంద్ర మంత్రి పోక్రియాల్ ఆ మీటింగ్లో అన్నారట. మరి ఏపీని మోడల్ గా తీసుకోవాలని చెబుతున్నారంటే.. ఏపీ అదరగొట్టినట్టే కదా.. ఏమంటారు..